Site icon HashtagU Telugu

India Squad: టీమిండియా ఎంపికకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 27 లేదా 28వ తేదీన‌ బీసీసీఐ స‌మావేశం..!

India Squad

India Victory

India Squad: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో జరగనుంది. మే 1లోగా అన్ని జట్లు తమ తమ జట్లను ప్రకటించాల్సి ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితిలో అందరి చూపు ప్రపంచ నంబర్-1 T20 జట్టు టీమిండియా (India Squad) ఏ ఆట‌గాళ్ల‌తో ప్రపంచ కప్‌లో బ‌రిలోకి దిగుతుందా అనే దానిపైనే ఉంది. BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ త్వరలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయడానికి సమావేశం నిర్వహించబోతున్నారని, ఆ తర్వాత ప్రపంచ కప్‌కు భారత జట్టును ప్రకటిస్తారని మీడియా నివేదిక‌ల్లో వైర‌ల్ అవుతోంది.

ఏప్రిల్ 27 లేదా 28వ తేదీన స‌మావేశం

ఓ వార్త సంస్థ నివేదిక‌ ప్రకారం సెలెక్టర్లందరూ ఏప్రిల్ 27 లేదా 28న ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించవచ్చు. ఏప్రిల్ 27న ముంబై ఇండియన్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుందని, అందువల్ల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఢిల్లీలో ఉంటాడు. నివేదిక ప్రకారం T20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టు ఎంపికను రోహిత్ శర్మ, అందరు సెలెక్టర్లు ఆమోదించాల్సి ఉంటుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం స్పెయిన్‌లో సెలవులో ఉన్నారు. ఏప్రిల్ 27 లేదా 28వ తేదీన ఢిల్లీకి వచ్చి నేరుగా సమావేశంలో పాల్గొంటారు.

Also Read: Chinese swimmers: డోపింగ్‌లో ప‌రీక్ష‌లో పాజిటివ్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న చైనీస్ స్విమ్మర్లు..!

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్ కోసం అమెరికా వెళ్లడం దాదాపు ఖాయమని ఇటీవ‌ల ప‌లు నివేదిక పేర్కొన్నాయి. ఈ ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ప్రపంచకప్‌లో ఆడతారు. ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాణించలేకపోయిన అతని ప్రదర్శన ఆధారంగా జ‌ట్టుకు ఎంపికవుతాడా..? అనే ప్ర‌శ్న‌ అంద‌రిలోనూ ఉంది.

భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది?

2024 T20 ప్రపంచ కప్‌లో 20 జట్లు పాల్గొంటాయి. ఇవి ఒక్కొక్కటి 5 జట్లతో 4 గ్రూపులుగా విభజించబడ్డాయి. పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో కూడిన గ్రూప్‌-ఎలో భారత జట్టు చోటు దక్కించుకుంది. భారత జట్టు జూన్ 5 నుంచి ప్రపంచ కప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

We’re now on WhatsApp : Click to Join