బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, అందుకే అక్కడ టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా కాలంగా వాదిస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని ఐసీసీకి ఆఫర్ ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
BCCI

BCCI

BCCI: ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుండి తప్పించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ కారణంతోనే 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌లో ఆడేందుకు బీసీబీ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో వేదికల మార్పు గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా.. బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు గట్టి షాక్ ఇచ్చేలా ఉంది.

వేదికల మార్పుపై బీసీసీఐ మౌనం వీడింది

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులు ఈ విషయంలో భిన్నమైన ప్రకటనలు చేస్తుండటంతో మీడియాలో వివాదం ముదిరింది. దీనిపై ఐఏఎన్ఎస్‌తో మాట్లాడిన బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఇలా అన్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను చెన్నైకి లేదా మరే ఇతర ప్రాంతానికి తరలించడం గురించి బీసీసీఐకి ఎలాంటి సమాచారం అందలేదు. ఇది మా నియంత్రణలో లేని విషయం. ఇది బీసీబీ, ఐసీసీ (ICC) మధ్య చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ఐసీసీనే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఒకవేళ ఐసీసీ వేదికలను మార్చాలని నిర్ణయిస్తే హోస్ట్ (ఆతిథ్య దేశం)గా బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి మా దగ్గర అలాంటి సమాచారం ఏదీ లేదు అని పేర్కొన్నారు.

Also Read: మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?

బీసీబీకి తగిలిన పెద్ద దెబ్బ

భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, అందుకే అక్కడ టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా కాలంగా వాదిస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని ఐసీసీకి ఆఫర్ ఇచ్చింది. ఈ ఐసీసీ టోర్నమెంట్‌కు భారత్‌తో పాటు శ్రీలంక కూడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఐసీసీ మాత్రం ప్రస్తుతానికి ఈ వివాదంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా ఉంది.

  Last Updated: 12 Jan 2026, 07:33 PM IST