Shreyas Iyer: గుజరాత్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ జరిమానా విధించింది. దీనివల్ల అతనికి 12 లక్షల రూపాయల ఫైన్ పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిని దోషిగా గుర్తించి ఈ శిక్ష ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఐపీఎల్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ పూర్తి వివరాలను వెల్లడించింది.
గత ఏడాది కూడా ఇదే తప్పు
శ్రేయస్ అయ్యర్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. గత సీజన్లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై రెండుసార్లు జరిమానా విధించారు. మొదటి తప్పుకు 12 లక్షల రూపాయలు, రెండోసారి 24 లక్షల రూపాయల ఫైన్ చెల్లించారు. నిర్ణీత సమయ పరిమితిలోగా జట్టు 20 ఓవర్లను పూర్తి చేయలేకపోతే అది జట్టు కెప్టెన్ తప్పిదంగా పరిగణించబడుతుంది. పంజాబ్ జట్టు మరోసారి స్లో ఓవర్ రేట్ తప్పు చేస్తే, అయ్యర్ నుండి రెట్టింపు జరిమానా వసూలు చేస్తారు.
Also Read: Kavitha : రాజకీయ ప్రయోజనాల కోసం యువతను వాడుకున్నారు.. కాంగ్రెస్ తీరుపై కవిత ఫైర్
గుజరాత్ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2026లో తమ మొదటి మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. గుజరాత్తో జరిగిన పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన పంజాబ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కూపర్ కోనోలీ 44 బంతుల్లో 72 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ సహాయంతో పంజాబ్ జట్టు 19.1 ఓవర్లలో 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా, యుజ్వేంద్ర చాహల్ తన 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
