India vs Pakistan: భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఆసియా కప్ మెన్స్ టీ20 ఆసియా కప్ 2025 షెడ్యూల్కు సంబంధించి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 4 లేదా 5 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు జరిగే అవకాశం ఉంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ యూఏఈ (UAE)లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనల్ షెడ్యూల్, వేదిక గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈసారి టోర్నమెంట్ కోసం యూఏఈ (UAE) ను న్యూట్రల్ వేదికగా దాదాపు ఖరారు చేసినట్లు భావిస్తున్నారు.
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 7న దుబాయ్లో జరుగనుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఇటీవల ICC చాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా ఇదే మైదానంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ కారణంగా భారత్ ఆసియా కప్ 2025లో పాల్గొనకపోవచ్చనే వార్తలు వచ్చాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణ కారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై అనిశ్చితి నెలకొంది. కానీ ఇప్పుడు మ్యాచ్ న్యూట్రల్ వేదిక అయిన యూఏఈలో జరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
Also Read: Suparipalana Tholi Adugu : “సుపరిపాలనలో తొలి అడుగు ” కార్యక్రమానికి విశేష స్పందన
ఆసియా కప్ 2025 ఫార్మాట్
- మొత్తం జట్లు: 6 (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ)
- ఫార్మాట్: మొదట గ్రూప్ స్టేజ్, ఆ తర్వాత సూపర్ ఫోర్
- అంచనా: ఈ టోర్నమెంట్లో భారత్- పాకిస్తాన్ రెండు సార్లు మ్యాచ్లు ఆడవచ్చు.
గత ఆసియా కప్లో ఏమి జరిగింది?
భారత్ డిఫెండింగ్ చాంపియన్. గత ఆసియా కప్ (ODI ఫార్మాట్)లో భారత్ ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది.
శ్రీలంకలో భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ చివరి మ్యాచ్?
- వేదిక: కొలంబో
- భారత్ స్కోరు: 356/2 (కోహ్లీ, రాహుల్ శతకాలు)
- పాకిస్తాన్ ఆలౌట్: 128
- ఫలితం: భారత్ 228 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దుబాయ్లో భారత్-పాకిస్తాన్ చివరి మ్యాచ్
- పాకిస్తాన్ స్కోరు: 241 ఆలౌట్
- భారత్ ప్రదర్శన: విరాట్ కోహ్లీ శతకం, 6 వికెట్ల తేడాతో విజయం
- ఫలితం: పాకిస్తాన్ ఒక్క విజయం కూడా సాధించకుండా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. భారత్ టైటిల్ గెలుచుకుంది.