భారత ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే శుక్రవారం ఉదయం చెన్నై (Home After Retirement) చేరుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం బ్రిస్బేన్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయం ధృవీకరించారు. అశ్విన్ బాక్సింగ్ డే టెస్టు కోసం మెల్బోర్న్ వెళ్ళకుండా స్వదేశానికి తిరిగి వస్తున్నారని తెలిపారు.
శుక్రవారం ఉదయం, చెన్నైలోని మద్రాస్ అంతర్జాతీయ మీనంబక్కం విమానాశ్రయం వద్ద అశ్విన్ కనిపించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన అశ్విన్, మీడియా ప్రతినిధులకు తనకు ప్రైవసీ ఇవ్వాలని కోరారు. రిటైర్మెంట్ ప్రకటన చేసినప్పుడే చెప్పినట్లుగా, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటికి చేరుకున్న అశ్విన్కు వీరాభినందనం లభించింది. సంప్రదాయ సంగీతం, హారతులతో అతన్ని సాదరంగా స్వాగతించారు. అశ్విన్ ఇంట్లో తొలిగా అతని తండ్రి అతడిని ఆలింగనం (Family In Tears Welcomed) చేసుకున్నారు. ఇక తల్లి మాత్రం భావోద్వేగానికి గురయ్యారు. అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన అశ్విన్, 675 వికెట్లు సాధించారు. క్రికెట్లో తన స్థానం చెరగనిది.
VIDEO | Former India crickter R Ashwin (@ashwinravi99) returns to Chennai from Australia.
R Ashwin, India's premier off-spinner, surprised the cricketing world yesterday by announcing his retirement in Brisbane with immediate effect in the middle of the Test series against… pic.twitter.com/OuRstMorik
— Press Trust of India (@PTI_News) December 19, 2024
Read Also : US Vs Pakistan : పాక్కు షాక్.. ఆ నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. ఎందుకు ?