Site icon HashtagU Telugu

Ashish Nehra: జాక్ పాట్ కొట్టిన ఆశిష్ నెహ్రా.. గుజ‌రాత్ ప్ర‌ధాన్ కోచ్‌గా భారీ వేత‌నం..!

Ashish Nehra

Ashish Nehra

Ashish Nehra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కోచింగ్ స్టాఫ్‌లో మార్పు ఉండవచ్చని భావించారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేద‌ని తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్‌లో మార్పు రాకపోతే ఇప్పుడు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra), క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకీ జట్టులో కొనసాగవచ్చని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

నిజానికి జట్టు యాజమాన్యం అహ్మదాబాద్‌కు చెందిన టోరెంట్ ఫార్మాకు వచ్చినందున ఈ ఇద్దరు ఆటగాళ్లు వచ్చే సీజన్‌లో జట్టును విడిచిపెట్టవచ్చని గతంలో నివేదికలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లను తమతో ఉంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Also Read: KTR : ఎవర్ని వదిలిపెట్టం..4 ఏళ్ల తర్వాత మాదే ప్రభుత్వం – కేటీఆర్ హెచ్చరిక

నెహ్రాకు రూ.8 కోట్లు

2022లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. జట్టు విజయంలో నెహ్రా, సోలంకీలు కూడా కీలక పాత్ర పోషించారు. తొలి సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శనల తర్వాత ఇద్దరూ తమ కాంట్రాక్ట్‌లను జ‌ట్టుతో చ‌ర్చించారు. నెహ్రా లీగ్‌లో అత్యధిక వేతనం పొందే కోచింగ్ సిబ్బందిలో ఒకడు అవుతాడని ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఐపీఎల్ 2025కు గాను ప్ర‌ధాన కోచ్ పాత్ర‌లో నెహ్రా దాదాపు రూ. 8 కోట్లు పొందవచ్చని స‌మాచారం.

తొలి ప్రయత్నంలోనే గుజరాత్‌ చాంపియన్‌గా నిలిచింది

నెహ్రా, సోలంకీ ద్వయం సారథ్యంలో గుజరాత్ తొలి సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిచింది. తొలి సీజ‌న్‌లో రాజస్థాన్‌ను ఓడించి ఆ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఆ జట్టు మరుసటి సంవత్సరం దాదాపు టైటిల్‌ను కాపాడుకుంది. అయితే ఆ జట్టు చివరి బంతికి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది జ‌రిగిన సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ జట్టును వీడి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ ఏడాది పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన గుజ‌రాత్.. హార్దిక్ జట్టు నుంచి నిష్క్రమించడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది.