Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్

" ఈ ఐపీఎల్ లో ధోనీ , హార్దిక్ పాండ్య లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ల ను కూడా సైలెన్స్ చేయించేలా ఒక ప్లేయర్ బౌలింగ్ వేశాడు.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 05:02 PM IST

” ఈ ఐపీఎల్ లో ధోనీ , హార్దిక్ పాండ్య లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ల ను కూడా సైలెన్స్ చేయించేలా ఒక ప్లేయర్ బౌలింగ్ వేశాడు. అతడి బంతులను అడ్డుకోవడమే తప్ప.. ఆడుకోవడం తెలియక మహా మహా బ్యాట్స్ మెన్లే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు” అని భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించారు. ఇంతకీ ఇర్ఫాన్ చెప్పింది ఏ బౌలర్ గురించి అంటే..అర్ష్ దీప్ సింగ్ !! పంజాబ్ సూపర్ కింగ్స్ కు చెందిన 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ చాలా చాకచక్యంగా బంతులు సంధిస్తాడని ఇర్ఫాన్ ప్రశంసలు కురిపించారు.

” గత 12 మ్యాచ్ లలో అర్ష్ దీప్ కేవలం 7 వికెట్లే తీసినప్పటికీ .. పరుగులు చాలా తక్కువగా ఇచ్చాడు. 12 మ్యాచ్ లలో అతడి బౌలింగ్ ఎకానమీ 7.69 మాత్రమే. కీలకమైన పవర్ ప్లే సెషన్లో, మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే చివరి ఓవర్లలో బౌలింగ్ ఇచ్చినా.. బ్యాట్స్ మెన్ ను నియంత్రణ లో పెట్టగలగడం అతడి ప్రత్యేకత” అని ఇర్ఫాన్ కామెంట్ చేశారు. “పంజాబ్ సూపర్ కింగ్స్ టీమ్ లో ఇప్పటికే కగీసో రబాడా వంటి ప్రఖ్యాత ఫాస్ట్ బౌలర్ ఉన్నా.. అర్ష్ దీప్ తనకంటూ గుర్తింపు ను సంపాదించడం అతడి ట్యాలెంట్ కు నిదర్శనం” అని ఇర్ఫాన్ తెలిపారు. ఈ ఐపీఎల్ సీజన్ మన భారత క్రికెట్ జట్టు కోసం ఉమ్రాన్ మాలిక్, మొహసిన్ ఖాన్, కుల్ దీప్ సేన్, ముకేశ్ చౌదరీ వంటి ఆణిముత్యాల్లాంటి బౌలర్లను వెలుగులోకి తెచ్చిందని పేర్కొన్నారు.