Site icon HashtagU Telugu

Jio Hotstar: జియో హాట్‌స్టార్ మెయిల్ సర్వర్‌ను హ్యాక్ చేసిన పాక్‌!

Jio Hotstar

Jio Hotstar

Jio Hotstar: మే 7న భారత సైన్యం పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ ఆపరేషన్‌కు భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టింది. వాస్తవానికి ఈ దాడి పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత జరిగింది. ఈ దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్‌లోని అనేక స్థావరాలపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. అయితే, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఐపీఎల్ 2025పై సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పాకిస్తానీ హ్యాకర్లు జియో హాట్‌స్టార్ (Jio Hotstar) మెయిల్ సర్వర్‌ను హ్యాక్ చేశారు.

హాట్‌స్టార్ మెయిల్ సర్వర్‌ హ్యాక్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 2025 ఉత్సాహం భారతదేశంలో కొనసాగుతోంది. ఐపీఎల్ 2025 యొక్క అధికారిక లైవ్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్‌స్టార్ వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తానీ హ్యాకర్లు జియో హాట్‌స్టార్ మెయిల్ సర్వర్‌ను హ్యాక్ చేశారు. దీంతో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మే 7న కేకేఆర్ vs సీఎస్‌కే మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే మే 11 ఆదివారం నాడు పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం.. ఈ మ్యాచ్‌ను ధర్మశాల నుంచి ముంబైకి మార్చే అవకాశం ఉంది. కానీ బీసీసీఐ ఇంతవరకు ఈ మ్యాచ్‌పై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

Also Read: Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబు బెదిరింపు.. పేల్చివేస్తామని పాక్ నుంచి మెయిల్‌!

9 ప్రాంతాలపై దాడి

నివేదిక‌ల్లో వ‌చ్చిన‌ సమాచారం ప్రకారం.. భారత సైన్యం పాకిస్తాన్‌లోని నాలుగు స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రాంతాల్లో బహవల్పూర్, మురిద్కే, సియాల్కోట్ వంటి ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌ను భారత స్థల, వాయు, నావికా దళాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఇది ఇప్పటివరకు భారత్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యగా పరిగణించబడుతోంది. సమాచారం ప్రకారం.. సైన్యం దాడి చేసిన తొమ్మిది స్థావరాలు పూర్తిగా విజయవంతమయ్యాయి. ఈ స్థావరాలు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టే జైష్-ఏ-మొహమ్మద్ (JeM), లష్కర్-ఏ-తొయిబా (LeT) వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నాయి. సైన్యం ప్రత్యేకంగా ఈ సంస్థల పెద్ద నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను ప్లాన్ చేసింది. ఇది గత 50 ఏళ్లలో పాకిస్తాన్ లోపల భారత్ చేపట్టిన అతిపెద్ద, ముఖ్యమైన సైనిక చర్యగా చెప్పబడుతోంది.