ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శ‌ర్మ‌!

అభిషేక్ శర్మ రేపటి మ్యాచ్‌లో ఆడతారా లేదా అనే అంశంపై తిలక్ వర్మ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు ముందు ఆయన ఎంత ఫిట్‌గా ఉన్నారనే దానిపైనే రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియాకు ఒక శుభవార్త.. అభిషేక్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కడుపులో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. రేపు మ్యాచ్ సమయంలో అభిషేక్ ఎలా ఉన్నాడు అనే దానిపైనే అతడిని ఆడించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని భారత స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. రేపు ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్- నమీబియా మధ్య మ్యాచ్ జరగనుంది.

అంతకుముందు అమెరికా (USA)తో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారని, ఆ కారణంగానే ఆయన మైదానంలో ఫీల్డింగ్‌కు కూడా రాలేకపోయారని సమాచారం. అయితే ఢిల్లీకి వచ్చాక ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఒకవేళ అభిషేక్ శర్మ సమయానికి కోలుకోకపోతే, ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే మ్యాచ్‌లో సంజు శాంస‌న్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read: బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

అభిషేక్ శర్మ ఆడతారా లేదా?

అభిషేక్ శర్మ రేపటి మ్యాచ్‌లో ఆడతారా లేదా అనే అంశంపై తిలక్ వర్మ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు ముందు ఆయన ఎంత ఫిట్‌గా ఉన్నారనే దానిపైనే రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయిన సంగతి తెలిసిందే.

మంగళవారం సంజు శాంస‌న్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఒకవేళ అభిషేక్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోతే టీమ్ మేనేజ్మెంట్ అన్ని ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని భావిస్తున్నట్లు ఇది సూచిస్తోంది. ఇదిలా ఉండగా అభిషేక్ శర్మ ఆదివారం నాడు గౌతమ్ గంభీర్ నివాసంలో డిన్నర్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

  Last Updated: 11 Feb 2026, 07:40 PM IST