IND vs BAN Playing XI: భారత్-బంగ్లాదేశ్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ సెప్టెంబరు 19 నుంచి చెన్నైలో జరగనుంది. తొలి టెస్టు మ్యాచ్కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లకు అవకాశం దక్కింది. రిషబ్ పంత్, ధృవ్ జురెల్ (Dhruv Jurel) ఇద్దరిలో ఎవరికి తొలి టెస్టు మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.
తొలి మ్యాచ్ లో రిషబ్ పంత్ (Rishabh Pant)ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతనికి చాలా అనుభవం ఉంది. 2022లో జరిగిన కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ తొలిసారిగా భారత్ తరఫున టెస్టు ఆడబోతున్నాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున పంత్ ఎన్నో చారిత్రాత్మక ఇన్నింగ్స్లు ఆడాడు. ఆస్ట్రేలియాలోని గబ్బా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో 89 పరుగులతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. వేగంగా పరుగులు సాధించే సత్తా కూడా పంత్కు ఉంది. రిషబ్ పంత్ 2018లో టీమ్ ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టెస్టు మ్యాచ్లు ఆడి 2271 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 5 సెంచరీలు మరియు 11 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా పంత్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో మొత్తం 119 క్యాచ్లు అందుకున్నాడు. 14 సార్లు స్టంప్ అవుట్లు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో పంత్కు అవకాశం దక్కడం ఖాయం. (IND vs BAN)
ఈ ఏడాది ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ధృవ్ జురెల్ భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్ లో నాలుగో టెస్టు మ్యాచ్ లో జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 39 మరియు 90 పరుగుల ఇన్నింగ్స్లు ఆడి టీమ్ ఇండియాను గెలిపించడంలో ముఖ్యమైన సహకారం అందించాడు. టీమ్ ఇండియా తరుపున ధృవ్ 3 టెస్ట్ మ్యాచ్ల్లో 190 పరుగులు చేశాడు. ఇందుకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇది కాకుండా ధృవ్ జురెల్ ఇప్పటివరకు ఉండి 5 క్యాచ్లు పట్టాడు. 2 స్టంపింగ్లు కూడా చేశాడు.
Also Read: Kohli-Gambhir interview: గొడవల్లేవ్, గంభీర్-కోహ్లీని కలిపిన బీసీసీఐ