మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఆయన నీళ్ల నిరంజన్ కాదు..కన్నీళ్ల నిరంజన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే ప్రేమలేని నిరంజన్ రెడ్డి…నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకుంటాడట. ఈయన ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీదు నోరువిప్పారా అంటూ ప్రశ్నించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ భజన తప్పా మరోకటి తెలియదన్నారు. రుణమాఫీ చేసిన వైఎస్సార్ రాక్షసుడట…రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిన కేసీఆర్ దేవుడట….అంటూ నిప్పులు చెరిగారు. ఒక మహిళను ఎదుర్కొలేకే జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు పిరికిపందల్లా ఫిర్యాదులు ఇస్తున్నారన్నారు. దమ్ముంటే మీరిచ్చిన వాగ్దాలనాపై బహిరంగ చర్చకు రండి అంటూ సవాల్ విసిరారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ భజన చేయడం తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియదు. రుణమాఫీ చేసిన వైయస్ఆర్ రాక్షసుడట? రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కేసీఆర్ దేవుడట? సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన వైయస్ఆర్ రాక్షసుడు అట, సంక్షేమాన్ని ఎత్తేసిన కేసీఆర్ దేవుడట.#PrajaPrasthanam #Jadcherla pic.twitter.com/uNaCbXCzS5
— YS Sharmila (@realyssharmila) September 17, 2022