Yadagirigutta: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రతి రోజూ వేలాది మంది భక్తులతో కళకళలాడుతుంది. ‘తెలంగాణ తిరుపతి’గా ఖ్యాతి పొందిన యాదాద్రి ఆలయాన్ని పండుగలు, వారాంతాలు, శుభదినాల్లో వేలాదిగా భక్తులు సందర్శిస్తూ స్వామివారి కృప కోరి వెళ్లిపోతుంటారు. ప్రత్యేకంగా, ఈ ఆలయంలో భక్తులు అధికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవడాన్ని ఆసక్తిగా భావిస్తారు. వివాహాలు, శుభకార్యాలు, కోరిక తీరిన తరువాత వంటి సందర్భాల్లో ఎక్కువ మంది భక్తులు ఈ వ్రతానికి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని కుటుంబ సమేతంగా పాల్గొంటారు.
Coconut Water : గర్భిణీలు కొబ్బరి నీళ్లు తాగొచ్చా.? తాగితే ఏమవుతుంది..?
ఇలాంటి సమయంలో భక్తులకు అనుకోని షాక్ ఇచ్చారు ఆలయ దేవస్థానాధికారులు. యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహించే సత్యనారాయణ వ్రతం టికెట్ ధరను గణనీయంగా పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఈవో వెంకట్రావు ఆదేశాలతో ఇప్పటివరకు రూ.800గా ఉన్న వ్రతం టికెట్ ధరను రూ.1000కి పెంచారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపారు.
అన్నవరం తర్వాత అత్యధికంగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించే ప్రదేశంగా యాదగిరిగుట్ట నిలిచింది. దీంతో ఈ ధర పెంపు అనేక భక్తులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే దేవస్థానం అధికారులు ఈ ధర పెంపుపై కూడా వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు భక్తులు టికెట్ తీసుకుంటే కేవలం పూజా సామగ్రిని మాత్రమే అందించేవారు. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం పెరిగిన ధరలో భాగంగా భక్తులకు పూజా సామగ్రితో పాటు స్వామివారి శేష వస్త్రాలు, సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిమను కూడా అందించనున్నట్లు తెలిపారు.
ఈ కొత్త ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చినట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో భక్తుల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ధరలు పెరగడం వల్ల సామాన్యులకు భారమవుతుందంటూ అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ఎక్కువ సేవలు అందిస్తున్నందున ఇది న్యాయమైన పెంపేనని భావిస్తున్నారు. ఏదేమైనా యాదగిరిగుట్టలో వ్రత సేవలకు ఇకపై కొత్త రూపమే అనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. యాదగిరిగుట్ట నారసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా పులిహోరా, లడ్డూ ప్రసాదాలు ఇవ్వాలని దేవస్థానం నిర్ణయించుకుంది. ఇందుకోసం ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు ట్రయల్గా పంపిణీ చేస్తారు. ఇందులో ఎలాంటి సమస్యలు లేకుండా సాగితే, జూలై 1వ తేదీ నుంచి ఈ ఉచిత ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వారంలో ఆరు రోజుల పాటు భక్తులకు ఉచితంగా పులిహోర ఇవ్వనున్నారు. ఇక శనివారం ప్రత్యేకంగా పులిహోరతో పాటు లడ్డూ కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ నిర్ణయం వల్ల భక్తులు ఆనందంగా స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకెళ్లవచ్చు.
Ahmedabad : విమాన ప్రమాదం.. సహాయక చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధం: ముకేశ్ అంబానీ