Longest Train: ఆ రైలులో 200లు కోచ్ లు.. కూర్చునేందుకు ఒక్క సీటు లేదు?

సాధారణంగా చాలామందికి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ప్రయాణం చేసి అనేక కొత్త కొత్త

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 02:00 PM IST

సాధారణంగా చాలామందికి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ప్రయాణం చేసి అనేక కొత్త కొత్త ప్రదేశాలను చూడాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాగా ఈ ప్రపంచంలో అనేక రకాల రైళ్లు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని రైళ్లు కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉండటంవల్ల అవి ఎంతో ప్రసిద్ధి చెందుతూ ఉంటాయి. అయితే అలాంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక రైలు కూడా ఒకటి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రైలు ప్రమాదకరమైనదిగా కూడా చెప్పుకోవచ్చు.

అయితే ఇది ఒక గూడ్స్ రైలు అయినప్పటికీ చాలామంది ఈ రైలులో వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రైలులో కనీసం కోచ్ లో కూర్చోవడానికి కూడా సీట్లు ఉండవు. అలాగే టాయిలెట్ కూడా ఉండదు. మరి ఈ రైలు ఎక్కడ నడుస్తుంది అన్న విషయానికి వస్తే.. ఈ రైలు ఆఫ్రికన్ దేశంలోని మౌరిటానియాలో నడుస్తుంది. ట్రైన్ డు డిజర్ట్ 1963 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ రైలు సహారా ఎడారి గుండా ప్రయాణిస్తుంది. ఈ రైలు 704 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 20 గంటలు పడుతుంది. ఈ రైలు పొడవు 2 కిలోమీటర్లు. ఇది 3 నుండి 4 డీజిల్ ఇంజన్లతో అనుసంధానమై ఉంటుంది. ఈ రైలు మౌరిటానియాలోని నౌదిబౌ, జురత్ నగరాల మధ్య నడుస్తుంది.

ఈ రైలులో 200 నుండి 210 సరుకులు రవాణా చేసే కోచ్‌లు ఉన్నాయి. ఒక కోచ్ ప్రయాణీకుల కోసం ఉంది. ఆఫ్రికన్ దేశంలోని డిజర్ట్ సమాజానికి చెందిన వారు ఈ రైలులో ప్రయాణిస్తారు. ఈ ప్రాంతంలోని వారికి ఈ రైలు జీవనాధారం లాంటిది. పని పరంగా, కుటుంబ సభ్యులను కలవడానికి ఈ రైలు అనువైన మార్గం. ఈ రైలులో ప్రయాణించేవారు 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను భరించవలసి ఉంటుంది. ఇక రాత్రి అయ్యింది అంటే చాలు ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్ కంటే దిగువకు నమోదవుతుంటుంది. ఇలా ఇంత ప్రమాదకరమైన రైలులో ప్రయాణిస్తూ ఉంటారు.