Rs 10 Love Letter: నీతో ఉండాలని ఉంది..26 నా పెళ్లి..రూ. 10 నోటు పై ప్రేమ సందేశం వైరల్..!!

సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ గా మారింది. ఏంటా పిక్ అనుకుంటున్నారా..? ఓ ప్రేమ సందేశానికి సంబంధించినది.

  • Written By:
  • Publish Date - April 20, 2022 / 10:49 PM IST

సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ గా మారింది. ఏంటా పిక్ అనుకుంటున్నారా..? ఓ ప్రేమ సందేశానికి సంబంధించినది. అయితే ఈ ప్రేమ సందేశాన్ని రాసింది కాగితంపై కాదు…పది రూపాయల నోటు మీద. ఆ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారిన నేపథ్యంలో నెటిజన్లను విపరీతంగా కామెంట్స్ చేస్తూ లైక్ లు కొడుతున్నారు. ఇంతకీ ఆ నోటుపై ప్రేమ లేఖ ఎవరి కోసం ఎవరు రాశారో తెలుసుకుందాం.

కుసుమ్ అనే అమ్మాయి…తన ప్రియుడు విశాల్ కు ఈ మెసేజ్ ను పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రేమ లేఖను పదిరూపాయల నోటుపై రాసింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఈ ప్రేమ సందేశం ప్రకారం ఏప్రిల్ 26న కుసుమ్ మ్యారేజ్ జరగనుందట. ఈలోపు తాను ప్రేమించిన విశాల్ కు ఈ విషయాన్ని తెలియజేయాలని కుసుమ్ నిర్ణయించుకుంది. ఆ పెళ్లి జరిగిలోగా తనను పెళ్లి నుంచి తప్పించమని అందులో కోరింది కుసుమ్.

అయితే ఈ ప్రేమ సందేశానికి సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది ఈ పోస్టును షేర్ చేస్తుండగా…మరికొంత మంది మాత్రం దీన్ని పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ లెటర్ విశాల్ కు చేరే లోపు ఇద్దు పిల్లల తండ్రి అవుతాడని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో దీనిపై సరదా మీమ్స్ కూడా వస్తున్నాయి.