హైదరాబాద్: జూబ్లీహిల్స్లో మరో రేప్ కేసు బయటపడింది. తన నివాసంలో స్నేహితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూన్ 13న జూబ్లీహిల్స్లోని పబ్లో బర్త్డే పార్టీకి హాజరైన ఆమె ఫ్లాట్కి తిరిగి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలుతో సహా ఆమె స్నేహితులు జూన్ 14న తెల్లవారుజామున 4:30 గంటల వరకు ఆమె నివాసంలోనే ఉన్నారు. ముగ్గురు స్నేహితులు బాధితురాలికి తాము వెళ్లిపోతున్నట్లు సమాచారం అందించారు, ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. “జూన్ 14 ఉదయం 6:15 గంటలకు ఆమెపై వాళ్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు తనను బలవంతంగా కింద పడేసి బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.