Germany: 12 ఏళ్లుగా భార్యను రూమ్ లో బంధించి టార్చర్ చేస్తున్న భర్త.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మానవత్వం మంట కలిసిపోతోంది. సమాజంలో చాలా మంది వ్యక్తులు సాటి మనుషుల పట్ల ఘోరంగా జంతువుల కంటే దారుణంగా ప్రవర్తి

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 04:20 PM IST

ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మానవత్వం మంట కలిసిపోతోంది. సమాజంలో చాలా మంది వ్యక్తులు సాటి మనుషుల పట్ల ఘోరంగా జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వారిని మనుషులు అనడం కంటే నరరూప రాక్షసులు మనిషి రూపంలో ఉన్న జంతువులు అనడం మంచిదేమో. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా అదే కోవకు చెందుతాడని చెప్పవచ్చు. ఆ వ్యక్తి తన భార్యను ఒకటి రెండు కాదండోయ్ ఏకంగా 12 ఏళ్ల పాటు గదిలో బందీగానే ఉంచాడు. ఈ సమయంలో ఆమెకు నరకం చూపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకోగా బాధితురాలు సెమీన్యూడ్‌ స్థితిలో శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. ఆ మహిళ భర్త చేతిలో అత్యంత దయనీయమైన పరిస్థితులను చవిచూసింది.

పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. 53 ఏళ్ల నిందితుడిని పోలీసులు జర్మనీలోని ఫోర్‌బ్యాక్‌ పట్టణంలోని ఒక అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్‌లో తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. 2011లో భర్త ఆమెను కిడ్నాప్‌ చేశాడట. రెండు రోజుల క్రితం ఆమెకు ఫోను అందుబాటులోకి రావడంతో ఆమె పోలీసులకు ఫోన్‌ చేసి, తన భర్త తనను గత కొన్నేళ్లుగా హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడని అరెస్టు చేశారు. తరువాత అతనిని భార్య తెలిపిన చిరునామాకు తీసుకువచ్చారు. అయితే నిందితుడు తన భార్యను దాచివుంచిన టార్చర్‌ రూమ్ చూపించేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసుల తమదైన శైలిలో అతని చేత టార్చర్‌ రూమ్‌ తలుపులు తెరిపించారు.

ఆ బాధితురాలు ఒక గదిలో బంధీగా పోలీసులకు కనిపించింది. భర్త ఆమెను ఇనుప తీగలతో కట్టేశాడు. ఆ గదిలోకి వెళ్లిన ముగ్గురు పోలీసులకు బాధితురాలు సెమీ న్యూడ్‌గా గుండుతో కనిపించింది. ఆమె చేతి వేళ్లు, కాలి వేళ్లు పనిచేయని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. అలాగే ఆమెకు కొంతకాలంగా ఆహారం ఇవ్వడం లేదని కూడా పోలీసులు తెలుసుకున్నారు. టార్చర్‌ రూమ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. ఆ ఇంటి ఇరుగుపొరుగువారు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటినుంచి ఒక మహిళ అరుపులు వినిపించేవని, తాము ఆ ఇంటి యజమానిని దీని గురించి అడిగినప్పుడు తన భార్యకు క్యాన్సర్‌ అని, బాధతో అలా అరుస్తుంటుందని చెప్పేవాడని అన్నారు. అయితే తాము ఎప్పుడూ ఆ బాధిత మహిళను చూడలేదని వారు తెలిపారు. అయితే పొరుగింటికి చెందిన ఒక వ్యక్తి తాను 10 ఏళ్ల క్రితం ఆ ఇంటిలో ఒక మహిళను చూశానని, ఇన్నాళ్లుగా కనిపించకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని, లేదా వేరే ప్రాంతానికి వెళ్లిందని అనుకున్నానని తెలిపారు. ఫ్రాన్సిసీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం పోలీసులకు ఆ ఫ్లాట్‌లో ఒక నోట్‌ బుక్‌ లభ్యమయ్యింది. దానిలో నిందితుడు తన భార్యను టార్చర్‌ పెట్టిన విధానాలను, ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని సమాచారం.