Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ లో కొత్త ఓటర్ల సంఖ్య ఎంతంటే.. 

Jammu Kashmir Assembly Elections

Jammu Kashmir Assembly Elections

Hyderabad: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు 18 నుంచి 19 ఏళ్లలోపు 65,595 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం తెలిపింది. జనవరి 23, 2024 నుండి ఏప్రిల్ 15 వరకు, మొత్తం 88,509 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో యువకులు కూడా ఉన్నారు. ఓటర్ల జాబితా నుంచి 1.24 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి, ఇందులో డూప్లికేట్ నమోదులు. మరణించిన వ్యక్తులు ఉన్నారు.

ఫిబ్రవరి 8, 2024న ప్రచురించబడిన ఓటర్ల జాబితా ప్రకారం.. 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 45,70,138 మంది ఓటర్లు ఉన్నారు, వీరు 3,986 పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు వేయనున్నారు. ఏప్రిల్ 18న విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) రోనాల్డ్ రోస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్  అభ్యర్థులు ప్రవర్తన గురించి తెలుసుకునే అవకాశాలున్నాయి. నేర చరిత్ర లేదని నిరూపించుకోవాలసి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో దాదాపు 50 శాతం పోలింగ్‌ కేంద్రాలు కీలకంగా ఉన్నాయని ఓ వర్గాలు తెలిపాయి.