హైదరాబాద్ పబ్లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని.. 354 ఐపీసీ 9 అండ్ 10 పోస్కో ఆక్ట్ కింద కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసాకే విచారణ ప్రారంభించామని.. బాలిక కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు. బాలిక శరీరంపై గాయాలు ఉన్నాయని.. ఘటన జరిగి 4 నాలుగు రోజులు గడిచిన కారణంగా నిందితులను గుర్తించలేకపోతుందన్నారు.
నిందితుల్లో కేవలం ఒకరి పేరు మాత్రమే బాలికి తెలిపిందని.. అన్ని కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించామని..ఐదుగురు లో ఇద్దరు మాత్రమే మేజర్ లు మిగుతా ముగ్గురు మైనర్లు అని తెలిపారు.నిందితులు మాలిక్ తో పాటు ఉమర్ ను అరెస్ట్ చేసామని… మరో 48 గంటలో మిగితా నిందితులను కూడా పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.
నిందితులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వారిపైనా కఠినంగా శిక్షిస్తామని..ఈ ఘటనలో హోమ్ మంత్రి మనవడు ఉన్నాడు అనేది పూర్తిగా అవాస్తమని డీసీపీ డేవిస్ తెలిపారు. పూర్తిగా సీసీ ఫుటేజీలని పరిశీలించామని…ఎక్కడ కూడా హోంమంత్రి మనవడు లేడని పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు ఉన్నాడు అనేది సమాచారం ఉందని.. బహదూర్ పుర ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడు అనేది సమాచారం ఉంది కాని విచారణ జరుపుతున్నామని తెలిపారు.