CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సీఎం జగన్

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 05:43 PM IST

CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తగు చర్యలు  తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జులై వరకు వివిధ పథకాలను అందుకోలేకపోయిన 2లక్షల 62వేల 169మంది లబ్ధిదారులకు 216.33 కోట్ల రూపాయిలను సీఎం విడుదల చేశారు.

తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్మోహనరెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. అనుకోని కారణాల వల్ల అర్హత ఉండి లబ్ది పొందుకోలేకపోయిన వారికోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. పలురకాల సంక్షేమ కార్యక్రమాల ద్వార ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

Also Read: 6 Indians Died: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు భారతీయులు దుర్మరణం!