Fake Pesticides: కల్తీ, నిషేధిత పురుగుమందుల విక్రయాలకు పాల్పడుతున్న 13 మందిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన 13 మందిలో 11 మంది మూడు వేర్వేరు ముఠాలతో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. వరంగల్లోని గీసుగొండ, నర్సంపేట, చెన్నారావుపేట, ఇనవోలు మండలాల్లో వరుస దాడులు నిర్వహించి అరెస్టు చేశారు. ఈ దాడుల్లో నకిలీ, గడువు ముగిసిన పురుగుమందులు, పురుగుమందుల తయారీకి ఉపయోగించే రూ.57 లక్షల విలువైన యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన భూక్య మాతృ రాథోడ్ ఇల్లు అక్రమ పురుగుమందుల తయారీ కేంద్రమని, ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకును హైదరాబాద్ నుంచి సేకరించినట్లు పోలీసులు తెలిపారు.హైదరాబాద్లోని మల్టీకెమ్ ఆగ్రో ఇండస్ట్రీలో అనధికారికంగా నకిలీ పురుగుమందులు, బయో ఎరువులు తయారుచేస్తున్నట్లు టాస్క్ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
Also Read: Road Accident: భూపాలపల్లి జిల్లాలో లారీ బీభత్సం..వ్యక్తి మృతి