Site icon HashtagU Telugu

Viveka: వివేకా కేసు పులివెందుల నుంచి కడప కోర్టుకు

Vivekananda Reddy

Vivekananda Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మేజిస్ట్రేట్ బదిలీ చేశారు. దీంతో వివేకా హత్య కేసుపై ఇక నుంచి కడప జిల్లా కోర్టులో విచారణ జరగనుంది. రిమాండ్, వాయిదా, బెయిల్ అంశాలు కడప కోర్టులో ఉన్నాయని మెజిస్ట్రేట్ తెలిపారు. మరోవైపు నలుగురు నిందితులు పులివెందుల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ నలుగురికి సీబీఐ చార్జిషీట్ల వివరాలను అందించారు. అంతకుముందు సీబీఐ అధికారులు ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని, అరెస్ట్ చేసిన వారిని పులివెందుల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కడప జైలు నుంచి సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను పులివెందులకు తీసుకొచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ సోమవారం మళ్లీ అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అప్రూవర్‌గా మారిన నిందితుడు గతంలో గత నవంబర్‌లో తన వాంగ్మూలాన్ని ఇచ్చాడని, ఇప్పుడు సోమవారం వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ వాంగ్మూలం ఆధారంగా సీబీఐ దర్యాప్తు ముందుకు సాగుతుంది.

Exit mobile version