సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) హీరోగా కార్తీక్ దండు తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మేనన్ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్ను ఏప్రిల్ 11న ఉదయం 11.07గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కాగా ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హీరో సాయితేజ్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.