కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆజాద్ రాజీనామాపై విచారం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తే… ఇతర పార్టీల నేతలు ఈ వ్యవహారంపై అంతగా స్పందించలేదు. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ రాజీనామాపై మాత్రం వేగంగా స్పందించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆజాద్కు ఆయన ఏకంగా అభినందనదలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డి ఓ పోస్ట్ పెట్టారు.
జవహర్లాల్ నెహ్కూ హయాం నుంచి కొనసాగుతున్న గులామ్ గిరీ నుంచి ఆజాద్ ఇప్పటికైనా బయటపడ్డారు అని సాయిరెడ్డి తన పోస్ట్లో పేర్కొన్నారు. ఆజాద్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదని కూడా సాయిరెడ్డి కీర్తించారు. కాంగ్రెస్ పార్టీలో ఎదురైన అనుభవాలు, ఆ పార్టీ నుంచి ఎందుకు బయట పడాల్సి వచ్చిందన్న విషయాలను ఇప్పటికైనా ఆజాద్ బయటపెట్టాలని సాయిరెడ్డి కోరారు.