తిరుమల తిరుపతి శ్రీవారిని ఇవాళ Vice President Venkayya Naidu దర్శించుకున్నారు. ఉదయం విరామ సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వెంకయ్య నాయుడుతో పాటుగా ఆయన సతీమణి ఉషా, కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనంతో ఎంతో సంతృప్తి లభించిందన్నారు. వెంకయ్యనాయుడితో పాటు ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, భరత్, బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి,కామినేని శ్రీనివాస్, సీనీనటుడు రాజేంద్రప్రసాద్, పుదుచ్చేరి మంత్రి సాయి శరవణ కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Vice President: శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు
తిరుమల తిరుపతి శ్రీవారిని ఇవాళ Vice President Venkayya Naidu దర్శించుకున్నారు.

Vice
Last Updated: 10 Feb 2022, 12:25 PM IST