Up chemical factory:యూపీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు…12కి చేరిన మృతుల సంఖ్య‌..!!

  • Written By:
  • Publish Date - June 5, 2022 / 12:58 AM IST

యూపీలోని హాపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12మంది మరణించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా బాయిలర్ పేలింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీలు కూడా దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి మూడు గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మంత్రి మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం విచారణకు ఆదేశించారు.