Site icon HashtagU Telugu

Union Cabinet Decisions: పండ‌గ‌కు ముందు మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Union Cabinet Decisions

Union Cabinet Decisions

Union Cabinet Decisions: ఇవాళ అంటే బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో (Union Cabinet Decisions) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఇతర లబ్ధిదారుల పథకాల కింద ఉచిత ధాన్యం పంపిణీని డిసెంబర్ 2028 వరకు కొనసాగించడానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ ప‌థ‌కాల కింద రూ. 17,082 కోట్లు ఖర్చవుతుందని, దీనిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలుస్తోంది. ఈ మేర‌కు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

పాక్ సరిహద్దులో రోడ్డు నిర్మాణం జరగనుంది

వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వ‌ర్గం తెలిపింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగుపడుతుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ప్రయాణం సులభతరం అవుతుంద‌ని, కొత్త రోడ్లు మొత్తం మిగిలిన హైవే నెట్‌వర్క్‌కు అనుసంధానించబడతాయని ఈ సంద‌ర్బంగా తెలిపారు.

Also Read: Bathukamma Celebrations In Delhi: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

గుజరాత్‌కు చెందిన లోథాల్‌కు బహుమతి లభించింది

దీనితో పాటు గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రాజెక్టుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భారతదేశం గొప్ప, వైవిధ్యమైన సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించడం ఈ ప్రతిపాదన లక్ష్యమ‌న్నారు. ఇది సిద్ధమైతే ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర వారసత్వ సముదాయం అవుతుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. మన సుసంపన్నమైన సముద్ర వైవిధ్యాన్ని పరిరక్షించడం, అభివృద్ధి చేయడం అవసరమ‌న్నారు.

ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో పూర్తవుతుందని ఆయ‌న తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఈ ప్రాజెక్ట్ యువతకు దాదాపు 22,000 ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. వీటిలో ప్రత్యక్షంగా 15,000, పరోక్షంగా 7,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్ట్ స్థానిక కమ్యూనిటీలు, పర్యాటకులు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపారవేత్తలతో సహా అనేక ఇతర వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రివర్గం తెలిపింది.