Site icon HashtagU Telugu

Siddipet: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

Crime

Crime

Siddipet : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన మర్కూక్ లో జరిగింది. మర్కూక్ వద్ద ఉన్న కాలువలో ఈత కోసం ఆరుగురు విద్యార్థులు కాలువలో మునిగారు. వెంటనే స్పందించిన స్థానికులు.. ఆరుగురు విద్యార్థులను కాపాడినప్పటికీ.. అందులో ఇద్దరు విద్యార్థులు అప్పటికే మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు మర్కూర్ గ్రామానికి చెందిన వినయ్(12), సంపత్(12) గా గుర్తించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version