TTD Tickets:శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. టికెట్లు విడుద‌ల చేసిన టీటీడీ..!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్‌. అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించి వృద్ధులు, దివ్యాంగుల కోటా ద‌ర్శ‌న టికెట్లను టీటీడీ గురువారం 10 గంట‌ల‌కు విడుద‌ల చేసింది.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 11:58 AM IST

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్‌. అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించి వృద్ధులు, దివ్యాంగుల కోటా ద‌ర్శ‌న టికెట్లను టీటీడీ గురువారం 10 గంట‌ల‌కు విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఈ దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.orgలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగే అక్టోబ‌ర్ 1 నుంచి అక్టోబ‌ర్ 5 తేదీల మ‌ధ్య కాకుండా మిగిలిన రోజులకు ఈ టికెట్లు విడుద‌ల చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. దర్శన టికెట్లతో పాటు అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించిన‌ రూమ్‌ల‌ను కూడా బుక్ చేసుకోవ‌చ్చు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.orgలో లాగిన్ అయ్యి ఈ ద‌ర్శ‌న‌ టికెట్లు, రూమ్‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చని టీటీడీ అధికారులు భ‌క్తుల‌కు సూచించారు.

ఇక‌పోతే.. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై యోగ నృసింహుడిగా మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రెండేళ్ల తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరగుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.