తిరుమల శ్రీవారి వార్షిక ఉత్సవమైన పవిత్రోత్సవాలను నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల శ్రీవారి ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవలను టీటీడి మూడు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసింది. భక్తులు ఈ విషయం తెలుసుకుని తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది.