Earthquake: అలర్ట్…హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు..!!!

హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 11:26 AM IST

హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియా సమీపంలోని తూర్పు తైమూర్ దేశంలో శుక్రవారం 6.1తీవ్రతతో భూకంపం సంభవించడంతో….ఇండియన్ ఓషియన్ సునామీ వార్నింగ్ మెటిగేషన్ సిస్టమ్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఈ భూకంపం సునామీ ప్రమాదాన్ని తీసుకురావచ్చన్న అంచనా వేసింది. తూర్పు తైమూర్ ఇండోనేషియా మధ్య తైమూర్ ద్వీపం నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.

కాగా ఇండోనేషియా దాని పరిసర దేశాలు..పసిఫిక్ రిమ్ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. మహాసముద్రం అంచున టెక్టానిక్స్ ప్లేట్ల కదలిక నిరంతం జరుగుతుంది. దీంతో సముద్రాల్లో ఉండే అగ్నిపర్వతాలు బద్ధలు అవుతుండటంతో తరచుగా భూకంపాలు వస్తుంటాయి.

2004లో సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో సునామీ ఏర్పడింది. ఈ విపత్తు ఇండోనేషియాను తూడుచుకుపెట్టుకుపోయింది. ఇండియా శ్రీలంక దేశాలపై దీని ప్రభావం చూపింది.