నేడు భారత్-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్రత్యేక బస్సులు నగరంలోని 24 ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి అందుబాటులో ఉండనున్నాయి. మెహదీపట్నం-శంషాబాద్ ఎయిర్పోర్టు, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, జీడిమెట్ల, కేపీహెచ్బీ, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, చార్మినార్, ఉప్పల్ రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.