TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీ.. 13 తీర్మానాలు ఇవే!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర లిఖించింది.

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 12:49 PM IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర లిఖించింది. 21 వసంతరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లీనరీ జరుపుకుంటోంది. జాతీయ రాజకీయాలే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభ ఇందుకు వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు సంక్షోభంలోనూ 24 గంటల కరెంట్‌ సరఫరాను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా ప్లీనరీ సాగుతోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ 13 తీర్మానాలను ప్రవేశపెట్టింది. అవి ఏటంటే..

తీర్మానం – 1
యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నందుకు అభినందన తీర్మానం

తీర్మానం – 2
దేశం విస్తృత ప్రయోజనాలరీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం

తీర్మానం – 3
ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం

తీర్మానం-4
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.

తీర్మానం – 5
భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం

తీర్మానం – 6
బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలనీ బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.

తీర్మానం – 7
తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం

తీర్మానం – 8
రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలనీ, డివిజబుల్ పూల్ లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం.

తీర్మానం – 9
నదీజలాల వివాద చట్టం సెక్షన్ – 3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.

తీర్మానం – 10
భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం.

తీర్మానం – 11
తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను , వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం.
తీర్మానం – 12
దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
తీర్మానం – 13
చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జి.ఎస్.టి.ని పూర్తిగా తీసివేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం