KTR Warns: బీజేపీని తరిమికొట్టడం ఖాయం

మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

  • Written By:
  • Updated On - April 7, 2022 / 05:06 PM IST

మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అనుమానించిన పార్టీ తోకలు కత్తిరించాలని ప్రజలను కోరారు కేటీఆర్. ధాన్యం కొనుగోల చేయాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల వద్ద టీఆరెస్ అధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. సిరిసిల్లాలో నిర్వహించిన ధర్నాలు కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేంద్ర మంత్రులు వెటకారంగా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఎందుకు కొనరంటూ ఆయన ప్రశ్నించారు. విదేశాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తుందన్నారు. ఈ విషయమై రాజ్యాసభను కూడా కేంద్రం మంత్రి పీయుష్ గోయల్ తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి తమ పార్టీ ఎంపీలు ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.

రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరితే…బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి ధాన్యాన్ని కేంద్రం చెప్పి కొనుగోలు చేపిస్తామని రైతులు రెచ్చగొట్టారని..రైతులు ధాన్యం పండించేలా చేశారన్నారు. వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తుందని మూడు దఫాలుగా బండి సంజయ్ చెప్పాడరన్నారు. బండి సంజయ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను కేటీఆర్ ధర్నాలో చూపించారు. రైతులు రోడ్డెక్కడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. అంతేకాదు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ చెప్పారని ఈ సందర్బంగా కేటీఆర్ గుర్తు చేశారు. మోదీ చెప్పినట్లుగా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా అని కేటీఆర్ రైతులను అడిగారు. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేదాకా తగ్గేలేదన్నారు.

ఇక వరి ధాన్యం కొనుగోలు విషయంపై టీఆరెస్ ఈ నెల 4వ తేదీ నుంచి రాష్ట్రంలో పలు రకాల ఆందోళనలు నిర్వహిస్తుంది. ఈనెల 4 మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న జాతీయ రహదారుల దిగ్భందనం చేపట్టింది.. ఈరోజు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు. ఈనెల 8న ప్రతి ఇంటిపై నల్లజెండాలను ఎగురవేయనున్నారు. 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆందోళనలు, పంజాబ్ రాష్ట్రం నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగానే తెలంగాణలో నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆరెస్ డిమాండ్ చేస్తోంది.