3 killed : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

  • Written By:
  • Updated On - July 13, 2022 / 12:20 PM IST

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని పూడూరు వద్ద ఉక్కు ఫ్యాక్టరీ సమీపంలో కారు ట్రక్కును ఢీకొట్టింది. కారులో కూర్చున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మృతులను జహీరా బీ (68), జావేద్ (12), ఒమర్ (6)గా పోలీసులు గుర్తించారు. గాయ‌ప‌డిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతి వేగంతో వెళ్తున్న కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి వాహనంపై నియంత్రణ కోల్పోయి ముందుకు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.