Warangal: కొత్త కారుకు పూజ చేయిద్దామని తెస్తే.. భక్తుల మీదకు ఎక్కింది.. చివరికి?

జీవితం అనేది ఎప్పుడూ మనం అనుకున్నట్లు జరగదు. కొన్నిసార్లు అనుకోని విధంగా కూడా జరుగుతుంటుంది.

  • Written By:
  • Publish Date - January 20, 2023 / 07:42 PM IST

Warangal: జీవితం అనేది ఎప్పుడూ మనం అనుకున్నట్లు జరగదు. కొన్నిసార్లు అనుకోని విధంగా కూడా జరుగుతుంటుంది. అందుకే జీవితాన్ని ఎవరూ ఊహించలేరని పెద్దలు అంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కొత్త కారుకు పూజలు చేయిద్దామని దర్గాకు తీసుకెళ్లాడు. దర్గా దగ్గర బాగా పూజలు చేయిస్తే అంతా మంచి జరుగుతుందని అతను అనుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు అయింది అతడి పరిస్థితి.

దర్గా దగ్గర పూజలు చేయించడానిక అని తీసుకెళ్లిన కారు.. ఒక్కసారిగా అదుపు తప్పడంతో అక్కడే ఉన్న భక్తుల మీద అది దూసుకెళ్లింది. భక్తుల మీదకు దూసుకెళ్లడంతో పాటు చుట్టు పక్కల ఉన్న పలు వాహనాల మీదకు అది దూసుకెళ్లడం జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు సమాచారం. పూజల కోసం అని తెచ్చిన కారు ఇలా అవుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు.

తెలంగాణలోని వరంగల్ జిల్లా అన్నారంలో ఓ కొత్త కారుకు దర్గాలో పూజలు నిర్వహిద్దామని తీసుకు రాగా..ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దర్గా దగ్గర కారును పార్క్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఒక్కసారి అదుపు తప్పడంతో భక్తుల మీదుగా పలు వాహనాలను గుద్దుకుంటూ కాస్త ముందుకు వెళ్లి ఆగింది. దర్గా వద్ద ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా బీభత్సంగా మారింది.

దర్గాలో పూజలు నిర్వహించడానికి వచ్చిన భక్తుల మీదకు కారు ఉన్నట్టుండి దూసుకురావడంతో.. నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు భక్తుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా కారు పలు వాహనాలను ఢీకొట్టడంతో అవి నుజ్జునుజ్జు అయ్యాయి. కారు డ్రైవర్ ను వెంటనే అక్కడ ఉన్న వారు పట్టుకొని చితకబాదారు.