Thailand: దారుణం.. యవ్వనం కోసం ముసలి రక్తంలో మద్యం కలుపుకొని తాగేస్తున్నాడుగా?

ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా కనిపించడం కోసం ఎన్నో రకాల పాట్లు పడుతూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడంతో పాటు వ్యాయామాలు యోగా

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 03:50 PM IST

ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా కనిపించడం కోసం ఎన్నో రకాల పాట్లు పడుతూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడంతో పాటు వ్యాయామాలు యోగాలు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఆహార పదార్థాల విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అని చెప్పవచ్చు. యవ్వనంగా కనిపించడం కోసం ఏకంగా రక్తంలో మందును కలుపుకొని తాగుతున్నాడు. అయితే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు. ఆ వ్యక్తికి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది.

ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. థాయ్‌లాండ్‌కు చెందిన రోజాకోర్న్‌ నైనోన్‌ మాత్రం రక్తపిపాసిగా మారాడు. అలాగని డ్రాకులా మాదిరిగా మనుషుల రక్తాన్ని పీల్చేయడం లేదు గాని, మొసళ్ల రక్తాన్ని మద్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు. నవయవ్వన రూపాన్ని పొందడం కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనికి సుమారు 12 లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫారమ్‌ ఉంది. ఇతను వాటి చర్మం, రక్తం, మాంసాలతో వ్యాపారం చేస్తుంటాడు. అయితే, ఒకరోజు శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉన్న, తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసింది.

దాంతో అప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు. అది కూడా కేవలం మూడు, నాలుగు ఏళ్ల మొసళ్ల రక్తం మాత్రమే. మొసళ్లు బలంగా ఉన్నప్పుడే వాటి రక్తం అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుంది. పైగా, మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం. అందుకే, మొసలి రక్తంలో లావోఖానో అనే థాయ్‌ మద్యాన్ని కలిపి కాక్‌టెయిల్‌ చేసుకొని రెండు పూటలా సేవిస్తాను అని కోర్న్‌ తెలిపాడు. ఈ మధ్యనే ఈ కాక్‌టెయిల్‌ను ఒక పెగ్‌ ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడు కోర్న్‌.