పుల్వామాలో మరో తీవ్రవాద చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు. సమాచారం అందుకున్నవెంటనే బాంబును కనిపెట్టి ధ్వంసం చేశారు సైనికులు. పుల్వామాలోని ఓ రోడ్డు పక్కన దాదాపు 5 కిలోల బరువు ఉన్న ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోసివ్ డివైజును(IED) ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. బాంబును కనిపెట్టడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా భారీ ఎత్తున్న ప్రాణనష్టం వాటిల్లేదని అధికారులు అన్నారు. 2019లోని పుల్వామా చేదు అనుభవాలు మరువకముందే తీవ్రవాదులు ఈ ఘాతుకానికి ప్రయత్నిచారు.