మాచర్లలో జరిగిన విధ్వంసకాండపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా నేతలంతా జిల్లా పార్టీ ఆఫీస్కు చేరుకుంటున్నారు. అయితే తెల్లవారుజామునుంచే ముఖ్య నేతల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. పోన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్కు బయలల్దేరగా ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని భారీ కాన్వాయ్తో ఆయన పార్టీ ఆఫీస్ వైపు వస్తున్నారు. ఇటు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సైతం పోలీసులను దాటుకుని పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ కోడెల శివరామ్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్ వైపుకు కార్యకర్తల్ని రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అటు మాచర్లలో కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.