ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేడు మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం లేకపోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. కేటీఆర్ విగ్రహావిష్కరణ చేస్తే అడ్డుకుని తీరుతామంటూ నందమూరి అభిమానులు నల్లమల రంజిత్, తాళ్లూరి శ్రీనివాస్, చేతుల నాగేశ్వరావు, సతీష్, మధు తారక్లు ప్రకటించారు. దీంతో వీరిని పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విగ్రహా ఆవిష్కరణకు నందమూరి కుటుంబంలో ఎవరినైనా ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండిచారు. ఎన్టీఆర్ అభిమానులు, విపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు.