Telangana SIT : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు.. ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ

తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్ప‌టికే ప‌లువురిని ప్ర‌శ్నించ‌గా కీల‌క...

  • Written By:
  • Updated On - November 22, 2022 / 11:13 AM IST

తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్ప‌టికే ప‌లువురిని ప్ర‌శ్నించ‌గా కీల‌క స‌మ‌చారం రాబ‌ట్ట‌డం కోసం బీజేపీ నేత‌లు బీఎల్ సంతోష్‌, తుషార్‌, జ‌గ్గుస్వామి ని కూడా విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న‌(సోమ‌వారం) వీరు విచార‌ణ‌కు రాక‌పోవ‌డంతో ఈ రోజు సిట్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల‌ను తెలంగాణ పోలీసులు అలెర్ట్ చేశారు.బీఎల్ సంతోష్‌, తుషార్‌, జ‌గ్గుస్వామి ని వాంటెడ్ జాబితాలో సైబ‌రాబాద్ పోలీసులు చేర్చారు.