Telangana Express: హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తెలంగాణ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ప్రయాణించే సమయంలో మార్పులు చేసినట్టు సమాచారం ఇచ్చింది రైల్వేశాఖ. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ప్రయాణించే ఈ ట్రైన్ 8 గంటలు ఆలస్యంగా వెళ్లనుంది.

Telangana Express: తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ప్రయాణించే సమయంలో మార్పులు చేసినట్టు సమాచారం ఇచ్చింది రైల్వేశాఖ. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ప్రయాణించే ఈ ట్రైన్ 8 గంటలు ఆలస్యంగా వెళ్లనుంది.

హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య ఆదివారం ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరేలా రీషెడ్యూల్ చేయబడింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులు షెడ్యూల్‌లో మార్పును గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించారు.

ఈ రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా.. ప్రయాణించి దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకుంటుంది. సుదీర్ఘంగా 27 గంటల పాటు ప్రయాణించి తన గమ్య స్థానాన్ని చేరుకుంటుంది.

Also Read: Bobby Deol in NBK109 బాబీకి తో బాబీ.. బాలయ్య 109లో యానిమల్ విలన్ ఢీ..!