Telangana Police: జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్ లో తెలంగాణకు అగ్రస్థానం

గుజరాత్ రాష్ట్రంలో ని అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన 6 వ జాతీయ ప్రిజన్ డ్యూటి మీట్ లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 11:21 PM IST

గుజరాత్ రాష్ట్రంలో ని అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన 6 వ జాతీయ ప్రిజన్ డ్యూటి మీట్ లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. విజేతలను హోం మంత్రి తన కార్యాలయంలో బుధవారం నాడు జరిగిన సమావేశంలో అభినందించారు.

జైళ్ళ శాఖ డి జి జితేందర్ , ఐ జి రాజేష్ తదితర జైలు అధికారులు పాల్గొన్న సమావేశం లో అధికారులు జాతీయ డ్యూటీ మీట్ లో తెలంగాణ అగ్రస్థానం సాధించిన వివరాలను వెల్లడించారు. ఈ డ్యూటి మీట్ లో మొత్తం 19 రాష్ట్రాలు , 960 మంది క్రీడాకారులు పాల్గోన్నారనీ, మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ డ్యూటి మీట్ లో 68 మంది తెలంగాణా జైళ్ల శాఖ ఉద్యోగులు వివిధ క్రీడాంశాలల్లో పాల్గోని అద్భుతమైన ప్రతిభను కనబరచారని కొనియాడారు. ఆరు బంగారు, ఒక వెండి, రెండు రజత పతకాలతో పాటు నాలుగు ట్రోపీలు సాధించడమే కాక , అత్యధిక పతకాలు సాధించి తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు.

డ్యూటి మీట్ లో బృందానికి వరంగల్ కేంద్రకారాగార పర్యవేక్షాణాధికారి సంపత్ సారథ్యం వహించారు. అభినందన కార్యక్రమంలో దేశంలో మొదటి స్దానం సాధించినందుకు కృషి చేసిన జైళ్ల శాఖ డి.జి జితేంధర్ , ఐ.జి రాజేష్ లను హోం మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.