తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా జైటీడీపీని హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఎలోన్ మస్క్, స్పేస్ఎక్స్ చిత్రాలతో పాటు కొన్ని పోస్ట్లను షేర్ చేశారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అకౌంట్ ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. “మా అధికారిక పార్టీ ఖాతా @jaitdp హ్యాక్ చేయబడిందని, దయచేసి గమనించాలని కోరారు. ఖాతాను పునరుద్ధరించడానికి మేం @TwitterIndiaతో కలిసి పని చేస్తున్నాం” అని ఆయన ట్వీట్ చేశారు. గతంలో పెగాసిస్ స్పైవేర్ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని మమతా బెనర్జీ ఆరోపించగా, నారా లోకేష్ ఆరోపణలను ఖండించారు.
Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.
— Lokesh Nara (@naralokesh) March 19, 2022