TDP Ayyannapatrudu : అయ‌న్న అరెస్ట్‌పై హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్‌.. మ‌ధ్యాహ్నం విచార‌ణ‌..?

మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ‌న్న‌పాత్రుడు, ఆయ‌న చిన్న కుమారుడు రాజేష్‌ని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 11:29 AM IST

మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ‌న్న‌పాత్రుడు, ఆయ‌న చిన్న కుమారుడు రాజేష్‌ని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం విశాఖ‌ప‌ట్నంలోని సీఐడీ కార్యాలయానికి ఇద్ద‌రిని త‌ర‌లించారు. అయితే అయ‌న్న అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. విశాఖప‌ట్నం పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, TNSF రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ను అరెస్ట్ చేసి ఆనందపురం పోలీస్ స్టేషన్ కి త‌ర‌లించారు. అయ‌న్న అరెస్ట్‌పై టీడీపీ లీగ‌ల్ సెల్ హైకోర్టులో లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వ‌కుండా అయ‌న్న‌ను,ఆయ‌న కుమారుడిని అరెస్ట్ చేశార‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను హైకోర్టు విచార‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ పిటిష‌న్ మ‌ధ్యాహ్నం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.