Hyderabad :హైద‌రాబాద్‌లో టాస్క్‌పోర్స్ దాడులు.. అక్ర‌మంగా నిల్వ ఉంచిన బాణాసంచా స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని రెండు చోట్ల సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గురువారం దాడులు నిర్వహించాయి. నివాస ప్రాంతాల్లో..

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 08:48 AM IST

హైదరాబాద్ నగరంలోని రెండు చోట్ల సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గురువారం దాడులు నిర్వహించాయి. నివాస ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ బృందం షాహిన్యాత్‌గంజ్‌లోని గో-డౌన్‌పై దాడి చేసి దీపావళి సందర్భంగా నగరంలో క్రాకర్లను అక్రమంగా నిల్వ చేసి విక్రయించడానికి ప్లాన్ చేస్తున్న నితేష్ కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. 8 లక్షల విలువైన పటాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో బృందం మిర్‌చౌక్‌లోని ఒక ఇంటిపై దాడి చేసి, పౌరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నివాస ప్రాంతంలో అక్రమంగా క్రాకర్లను నిల్వ చేసిన వ్యక్తి వేణు గోపాల్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.