Supreme Court: న్యాయమూర్తుల మధ్య వివాదం.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయ‌తీ

కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తుల మధ్య కొనసాగుతున్న వివాదం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. సుప్రీంకోర్టు స్వయంగా శుక్రవారం (జనవరి 26) ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.

  • Written By:
  • Updated On - January 27, 2024 / 09:54 AM IST

Supreme Court: కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తుల మధ్య కొనసాగుతున్న వివాదం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. సుప్రీంకోర్టు స్వయంగా శుక్రవారం (జనవరి 26) ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్, అనిరుద్ధ బోస్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ డబుల్ బెంచ్ ఆదేశాలను విస్మరించింది. డబుల్ బెంచ్‌కు అధ్యక్షత వహిస్తున్న జస్టిస్ సౌమెన్ సేన్ రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును సుప్రీంకోర్టు ఈరోజు అంటే శనివారం (జనవరి 27) ఉదయం 10:30 గంటల నుంచి విచారించనుంది. వీటన్నింటి మధ్య ఈ వివాదమేమిటనే ప్రశ్న జనాల్లో కలుగుతోంది. ఈ వివాదంపై ఓ లుక్కేద్దాం.

Also Read: Manoj Jarange: మరాఠా రిజర్వేషన్లు.. ఉద్యమాన్ని విరమించిన మనోజ్ జరంగే.!

జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ vs జస్టిస్ సౌమెన్ సేన్ కేసు ఏమిటి?

– లైవ్ లా ప్రకారం,ఇటీవల కలకత్తా హైకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది. అందులో పశ్చిమ బెంగాల్‌లో కుల ధృవీకరణ పత్రాలు మోసపూరితంగా జారీ చేయబడుతున్నాయని ఉంది. ఈ కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందారనే పిటిషన్‌పై జనవరి 24 (బుధవారం) ఉదయం జస్టిస్ గంగోపాధ్యాయ సింగిల్ బెంచ్ పశ్చిమ బెంగాల్ పోలీసులను ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సీబీఐకి అప్పగించాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

– ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై జస్టిస్ సౌమెన్ సేన్, ఉదయ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్టే విధించింది.

– గురువారం జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వు పూర్తిగా చట్టవిరుద్ధమని, దానిని విస్మరించమని అన్నారు.

– సింగిల్‌ బెంచ్‌ ఆర్డర్‌పై స్టే విధించేందుకు డబుల్‌ బెంచ్‌ అనుమతించే నిబంధన ఏంటని జస్టిస్‌ గంగోపాధ్యాయ అడ్వకేట్‌ జనరల్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో అప్పీల్‌కు దరఖాస్తు లేనప్పుడు, ఆర్డర్‌ను ఎలా పాస్ చేస్తారని ఆయన అన్నారు.

– ఇది మాత్రమే కాదు జస్టిస్ గంగోపాధ్యాయ తన ఆదేశాలలో బెంచ్‌కు నాయకత్వం వహిస్తున్న జస్టిస్ సేన్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా జస్టిస్ సేన్ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు.