లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్న సునీత, ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని స్పీకర్ను కోరారు. అంతేకాదు సీబీఐ అధికారులకు తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచింది సునీత రెడ్డి.
ఈ క్రమంలో సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్కు అందజేసిన సునీత, వెంటనే దీనిపై విచారణ జరిపి, తన తండ్రిని హ్యత చేసిన నిందితులకు శిక్ష విధించాలని కోరారు. ఇక తన అన్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రంలో తనకు న్యాయం జరుగడం లేదని, మీరైనా దీనిపై స్పందించాలని ఆమె లేఖ ద్వారా స్పీకర్ను విన్నవించారు.
ఇకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐకి, సునీత రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇదే అంటు ఓ ప్రముఖ తెలుగు పత్రిక తాజాగా ఓ కథనాన్ని ప్రచురించిగా, ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలసిందే. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో, ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత రెడ్డి, ఆ వాంగ్మూలంలో స్పష్టం చెసింది. అలాగే ఈ విషయం సీఎం జగన్కు తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.