Swimming: వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాల, కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులకు నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ పలు సూచనలు చేశారని, వేసవిలో చాలా మంది విద్యార్థులు ఈత నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని, ఈత నేర్చుకోవాలనుకునే వారు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. చెరువులు, బావులు మరియు కాలువలకు, వారు పెద్దల పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలని కోరారు.
We’re now on WhatsApp : Click to Join
అదేవిధంగా ఈత నేర్చుకునే సమయంలో సేఫ్టీ జాకెట్లు లేదా ఎయిర్ ట్యూబ్లు వాడాలని, అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఒంటరిగా నీటి ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని, ముఖ్యంగా గ్రామాల్లో పెద్దలు పిల్లలపై నిఘా ఉంచాలని అన్నారు. గతంలో కాల్వలు, చెరువుల్లో పడి మృతి చెందిన సంఘటనలు జరిగాయి. దయచేసి జాగ్రత్తలు తీసుకోకుండా ఈత నేర్చుకునే ప్రాంతాలకు వెళ్లవద్దని, వీలైనంత వరకు పెద్దల పర్యవేక్షణలో బావులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి ప్రదేశాల్లో ఈత నేర్చుకోమని చెప్పారు.
Also Read: Bandi Sanjay : సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ