Maharashtra : మ‌హారాష్ట్ర‌లో విషాదం.. స్కూల్ గోడ కూలి బాలుడు మృతి

మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భివాండిలో పాఠశాల కాంపౌండ్ వాల్ మార్బుల్ స్లాబ్ పడి 4..

  • Written By:
  • Publish Date - December 4, 2022 / 06:43 AM IST

మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భివాండిలో పాఠశాల కాంపౌండ్ వాల్ మార్బుల్ స్లాబ్ పడి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తావ్రే కాంపౌండ్ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. చిన్నారిని ఆనంద్ కుష్వాహగా పోలీసులు గుర్తించారు. ఈ స‌మ‌యంలో పాఠ‌శాల వ‌ద్ద బాలుడు ఆడుకుంటుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.