Sonipat: సోనిపట్ జిల్లాలోని రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సమయంలో, సిలిండర్లలో పేలుళ్లు సంభవించాయి. దీని కారణంగా 20 మందికి పైగా కార్మికులు దహనం అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీలో చిక్కుకున్న ఇతర ఉద్యోగులను రక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
ఫ్యాక్టరీలో రబ్బరు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. 16 మంది ఉద్యోగులు ఇప్పటివరకు ఆసుపత్రికి చేరుకున్నారు, వారిని పిజిఐకి రిఫర్ చేశారు. సివిల్ ఆసుపత్రిలో అత్యవసర విధుల కోసం వైద్యులను పిలిపించారు. ప్రమాదంపై కేసు నమోదు అయింది. ప్రమాద ఘటనకు సంబందించిన విషయాలేమీ ఇంకా బయటకు తెలియరాలేదు. అయితే పోలీసులు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Delhi : సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటి